న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలోని కంఝావాలా ఏరియాలో ఈ నెల 1న అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు.. స్కూటీపై వెళ్తున్న అంజలి అనే 20 ఏండ్ల యువతిని కారుతో ఢీకొట్టారు. యువతి కారులో ఇరుక్కుపోయినా ఆపకుండా 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. దాంతో యువతి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది.
ఆ ఘటనను మరువకముందే అలాంటిదే మరో ఘటన తాజాగా చోటుచేసుకుంది. రాజౌరి గార్డెన్ ఏరియాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టారు. అతడు ఎగిరి కారుపై పడినా కారును ఆపకుండా అలాగే ఈడ్చుకెళ్లారు. పైగా వాహనాల రద్దీ బాగా ఉన్న రోడ్డుపై ఇలాంటి ఘటన జరగడం గమనార్హం.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఇండియన్ పీనల్ కోడ్లోని 279, 323, 341, 308 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
#WATCH | A man was dragged on car’s bonnet in Delhi’s Rajouri Garden(12.01)
An incident of road rage occured that led to incident shown in video. Case registered under IPC sec 279, 323, 341, 308. Accused identified, being interrogated: Delhi Police
(Visuals confirmed by Police) pic.twitter.com/RdVGuU7QXL
— ANI (@ANI) January 14, 2023