న్యూఢిల్లీ: పలు వెర్షన్ల యాపిల్ ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్లలో లోపాలు గుర్తించినట్టు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పేర్కొన్నది. సైబర్ నేరస్థులు యూజర్ల డాటా దొంగిలించేందుకు యాక్సెస్ పొందగలిగేందుకు అవకాశం ఉన్నదని, ఆర్బిటరీ కోడ్ను ఎగ్జిక్యూట్ చేయడంవంటివి జరిగే ప్రమాదం ఉన్నదని అడ్వైజరీలో పేర్కొన్నది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది.