వాలెంటైన్స్ డే సందర్భంగా మధ్యప్రదేశ్కు చెందిన శివసేన కార్యకర్తలు తీవ్ర హెచ్చరికలే జారీ చేశారు. ఈ సందర్భంగా కర్రలు చేతబూని, వాటికి కాళికా దేవి మందిరంలో పూజలు కూడా నిర్వహించారు. వాలంటైన్స్డే సందర్భంగా ఎవరైనా పార్కుల్లో జంటలుగా కనిపిస్తే.. చితక్కొడతాం అని తీవ్రంగా హెచ్చరించారు. వాలెంటైన్స్డే సందర్భంగా తాము వివిధ ప్రాంతాల్లో కర్రలను చేతబూని తిరుగుతామని, ఏ జంటలైనా కనిపించాయో.. వాటికి అక్కడికక్కడే పెళ్లి చేసేస్తామని శివసేన కార్యకర్తలు హెచ్చరించారు.