సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా ఓవరాల్గా 37.19 శాతం పోలింగ్ నమోదైంది. సిమౌర్లో అత్యధికంగా 41.89 శాతం, లాహౌల్ స్పతిలో అత్యల్పంగా 21.95 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇక మిగతా ముఖ్య నియోజకవర్గాల విషయానికి వస్తే.. బిలాస్పూర్లో 34.05 శాతం, చాంబాలో 28.35 శాతం, హమీర్పూర్లో 35.86 శాతం, కాంగ్రాలో 35.50 శాతం, కిన్నౌర్లో 35 శాతం, మండిలో 41.17 శాతం, సిమ్లాలో 37.30 శాతం, సోలన్లో 37.90 శాతం, కుల్లులో 40.33 శాతం, ఉనాలో 39.93 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు.