కోల్కతా: బెంగాల్కు కొత్త డీజీపీని నియమించారు. వివేక్ సహయే(Vivek Sahay)ను కొత్త డీజీపీగా బెంగాల్ ప్రభుత్వం నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డీజేపీని మార్చిన విషయం తెలిసిందే. రాజీవ్ కుమార్ను డీజీపీ పోస్టు నుంచి తప్పించిన తర్వాత ఆయన స్థానంలో వివేక్ను నియమించారు. వివేక్ సహయే 1988 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. గత ఏడాది డిసెంబర్లో రాజీవ్ కుమార్ను డీజీపీగా నియమించారు. ఇప్పుడు ఆయన్ను ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ శాఖకు తరలించారు. ఈ శాఖకు ఎన్నికలకు సంబంధం ఉండదు. 2016 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా రాజీవ్ కుమార్ను ఎన్నికల విధుల నుంచి తప్పించారు. ఆ రిపోర్టు ఆధారంగా ఇప్పుడు మళ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను డీజీపీ హోదా నుంచి తొలగించారు.