కశ్మీర్ ఫైల్స్… దేశంలో సంచలనం రేపిన సినిమా. ఆ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా అంతే సంచలనం రేపారు. ఇప్పుడు అదే అగ్నిహోత్రి మరో సంచలన ప్రకటన చేశారు. తన నెక్ట్స్ సినిమా ఢిల్లీ ఫైల్స్ అని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. కశ్మీర్ ఫైల్స్ను సొంతం చేసుకున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. 4 సంవత్సరాలుగా ఈ సినిమా కోసం చిత్తశుద్ధితో మా టీమ్ పనిచేసింది. కశ్మీరీ హిందువులకు జరిగిన అన్యాయాన్ని చూపించాం. ఇక మరో సినిమాపై పని చేయాల్సి వుంది. అదే ఢిల్లీ ఫైల్స్ అంటూ వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు.