ముజఫర్నగర్, జనవరి 25: ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న బీజేపీ నేతలకు తీవ్ర భంగపాటు ఎదురవుతున్నది. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. తాజాగా బుధానా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమేశ్ మాలిక్ మంగళవారం తన మద్దతుదారులతో కలిసి రసూల్పూర్ జతన్ అనే గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయన్ను ఘెరావ్ చేశారు. ఆయన ఒక గల్లీ గుండా వెళ్తుండగా ఇరువైపులా గుమిగూడిన గ్రామస్తులు మాలిక్తో పాటు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థి రాజ్పాల్ బల్యాన్కు అనుకూల నినాదాలిచ్చారు. ప్రచారంలో ఆదివారం మసూర్పూర్ అనే గ్రామానికి వెళ్లిన మాలిక్కు అక్కడ కూడా చుక్కెదురైంది. గత ఎన్నికల హామీలపై ప్రజలు నిలదీశారు.