సాధారణంగా ఏ పెళ్లిలోనైనా వరుడు గుర్రంపైన లేదా కారులో కూర్చొని బరాత్లో పాల్గొంటారు. కానీ, ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వరుడు బరాత్కు ఏకంగా బుల్డోజరే ఎక్కి వచ్చాడు. అందంగా అలంకరించిన బుల్డోజర్పై వచ్చిన వరుడిని చూసేందుకు గ్రామస్తులంతా ఎగబడ్డారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్లోని లక్ష్మణ్పూర్-శంకర్పూర్ గ్రామంలో వరుడు బుల్డోజర్పై బరాత్లో పాల్గొన్నాడు. ఇది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. బుల్డోజర్ ఎదుట నిల్చొని సెల్ఫీలు తీసుకున్నారు. వరుడిని వదిలేసి అందరూ బుల్డోజర్తో ఫొటోలు దిగారు. వధువు గ్రామంలో అందరినీ దృష్టినీ ఆకర్షించడంతో వరుడు ఉబ్బితబ్బిబైపోయాడు. తన వివాహాన్ని ఒక చిరస్మరణీయమైన ఈవెంట్గా మార్చాలనుకున్నానని, అందుకే ఇలా ప్లాన్ చేశానని వరుడు చెప్పుకొచ్చాడు.