ముంబై : శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వె (షిండే వర్గం) పార్టీ ప్రతినిధి శీతల్ మాత్రేలు మహారాష్ట్రలోని దహిసర్లో ఆశీర్వాద్ యాత్ర సందర్భంగా ముద్దుపెట్టుకున్న వీడియో వైరల్గా మారింది. ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజార్చేందుకే మార్ఫింగ్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ప్రకాష్ కుటుంసభ్యుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి మనస్ కువార్ (26), అశోక్ మిశ్రా (45)లను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా నేతతో సేన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వె మార్ఫింగ్ వీడియోను వైరల్ చేసిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఈ అంశంపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
సేన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వె, పార్టీ ప్రతినిధి శీతల్ మాత్రే సీఎం ఏక్నాథ్ షిండే ర్యాలీలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను అభాసుపాలు చేసేందుకే కొందరు మార్ఫింగ్ వీడియోను వైరల్ చేస్తున్నారని శీతల్ మాత్రే ఆరోపించారు. మాతోశ్రీ పేరుతో ఉన్న ఎఫ్బీ పేజ్లో మార్ఫ్డ్ వీడియోను అప్లోడ్ చేశారని ఈ సమయంలో మీకు బాలాసాహెబ్ సంస్కారం గుర్తుకు రాలేదా అని ఆమె ప్రశ్నించారు.