న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త ప్రకటన చేశారు. కారు సామర్ధ్యాన్ని తెలియజేసే పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్ ఎన్సీఏపీ ద్వారా ఇండియాలో తయారయ్యే వాహనాలకు ఇక నుంచి స్టార్ రేటింగ్స్ ఇవ్వనున్నారు. అయితే ఆ రేటింగ్ దక్కాలంటే, ముందుగా ఆ కార్లకు క్రాష్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్( ఎన్సీఏపీ) విధానంపై మంత్రి గడ్కరీ ఇవాళ వరుస ట్వీట్లు చేశారు. వినియోగదారుడి రక్షణ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేసినట్లు చెప్పారు. భారత్లో తయారయ్యే వాహనాల ఉత్పత్తి నాణ్యత మెరుగ్గా ఉందని చెప్పేందుకు రేటింగ్ పనిచేస్తుంది. వాహనం దేన్నైనా ఢీకొంటే అప్పుడు ఆ వాహనం ఆ ప్రభావాన్నిఎలా తట్టుకుంటుంది, ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులు ఎంత సురక్షితంగా ఉంటారో క్రాష్ట్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షలో ఉత్తమంగా తేలే కంపెనీ కార్లకు ప్రభుత్వం రేటింగ్ ఇవ్వనున్నది. దీని ద్వారా ఆ కార్ల అమ్మకాలు పెరిగే ఛాన్సు ఉంటుంది. అంతేకాదు అలాంటి కార్లనే విదేశాలకు ఎగుమతి చేయనున్నారు.
The testing protocol of Bharat NCAP shall be aligned with Global Crash Test Protocols factoring in the existing Indian regulations, allowing OEMs to get their vehicles tested at India’s own in-house testing facilities.
— Nitin Gadkari (@nitin_gadkari) June 24, 2022