న్యూఢిల్లీ, జనవరి 30: దేశంలో సుమారు 9 లక్షల ప్రభుత్వ వాహనాలు తుక్కుగా మారనున్నాయి. ఇటీవల చేసిన చట్టం ప్రకారం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ట్రాన్స్పోర్టు కార్పొరేషన్లకు చెందిన వాహనాలను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నిషేధిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం వెల్లడించారు. వీటి స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను అందుబాటులోకి తెస్తామన్నారు.