-ట్విట్టర్లో కేంద్రంపై బీజేపీ ఎంపీ వరుణ్గాంధీచురకలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి సొంతపార్టీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బ్యాంకులను ముంచడంలో విజయ్ మాల్యా, నీరవ్మోదీల సరసన తాజాగా ఏబీజీ షిప్యార్డు మాజీ చైర్మన్ రుషీ అగర్వాల్ చేరడాన్ని ప్రస్తావిస్తూ.. బలమైన ప్రభుత్వం ఉన్నట్టయితే అవినీతిపై బలమైన చర్య ఉండాలి కదా అని చురకలు వేశారు. మాల్యా రూ.9 వేల కోట్లు, నీరవ్ మోదీ రూ.14 వేల కోట్లు మోసగించి దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా రుషి రూ.23 వేల కోట్ల కుంభకోణం కేసులో కేంద్ర బిందువుగా ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకున్న దేశంలో రోజూ 14 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటే పైన తెలిపిన వ్యక్తులు సంపదలతో తులతూగుతున్నారని వరుణ్ ఎత్తిచూపారు.