వారణాసి, డిసెంబర్ 21: వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు శాస్త్రీయ సర్వే రిపోర్టును వచ్చే నెల 3న తెరుస్తామని స్థానిక జిల్లా కోర్టు తెలిపింది. వాస్తవానికి ఈ రిపోర్టును గురువారం తెరువాలని, బార్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో కోర్టుకు హాజరుకాలేనని ముస్లిం పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు సీల్డ్ రిపోర్టును వచ్చే నెల 3న తెరుస్తామని, రిపోర్టు కాపీలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు అందజేస్తామని తెలిపింది. రిపోర్టును భారత పురావస్తు శాఖ సీల్డ్ కవరులో కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే.