న్యూఢిల్లీ, డిసెంబర్ 2: గాంధీనగర్-ముంబై మధ్య ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ప్రారంభించిన వందేభారత్ రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉడ్వాడా, వాపి స్టేషన్ల మధ్య వందేభారత్ రైలు ఓ పశువును ఢీకొన్నది. ఈ ఘటన గురువారం సాయంత్రం 6:23 గంటలకు జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో రైలు ముందు భాగం దెబ్బతిన్నదని వెల్లడించారు. అక్టోబర్ 29, అక్టోబర్ 6, 7 తేదీల్లోనూ ఈ రైలు ప్రమాదానికి గురైంది. పశువులను ఢీకొనడంతో రైలు ముందుభాగం ముక్కలు కావడంపై విమర్శలు వచ్చాయి. రైలు నాణ్యతపై నెటిజన్లు సెటైర్లు వేశారు.