న్యూఢిల్లీ: పిల్లలకు కరోనా వ్యాక్సిన్ను 6 నెలల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. ‘కొవోవ్యాక్స్’ వ్యాక్సిన్పై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, ఇది పిల్లలపై సమర్థంగా పనిచేస్తుందన్నారు. అదృష్టవశాత్తు పిల్లలపై కొవిడ్ ప్రభావం చూపలేదని, కొత్త వేరియంట్లు ముఖ్యంగా ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియదని చెప్పారు. బూస్టర్ డోసుతో యాంటిబాడీలు పెరుగుతాయని దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.