గోండా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. గోండా పట్టణంలోని ఫోర్బ్స్గంజ్ లొకాలిటీలో ఆన్లైన్ పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడిని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు గొంతు నులిమి చంపేశారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు మొబైల్ కెమెరాలో రికార్డయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణకుమార్ యాదవ్ అనే వ్యక్తి తన చెల్లెలితో కలిసి ఫోర్బ్స్గంజ్ లొకాలిటీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇద్దరూ ప్రైవేటు స్కూళ్లలో పాఠాలు చెబుతూ జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో కృష్ణయాదవ్ చెల్లెలుకు తనతోపాటు స్కూల్లో టీచర్గా పనిచేసే సందీప్ యాదవ్తో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, వారి ప్రేమ విషయం తెలుసుకున్న కృష్ణయాదవ్.. సందీప్ యాదవ్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తన చెల్లెలి జోలికి రావద్దని చెప్పాడు. దాంతో కృష్ణయాదవ్ తమ ప్రేమగా అడ్డుగా ఉన్నాడని భావించిన సందీప్ యాదవ్ అతడిని హతమార్చేందుకు కుట్రపన్నాడు. జగ్గా అనే స్నేహితుడి సాయంతో ఆన్లైన్లో పాఠాలు చెబుతుండగానే కృష్ణయాదవ్ను గొంతు నులిమి చంపేశారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులు ఇద్దరి కోసం ముమ్మరంగా గాలించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ హత్య ఘటన శనివారం సాయంత్రం జరగగా నిందితులు ఇవాళ పట్టుబడ్డారు.