న్యూఢిల్లీ: భారత వాయుసేనలో చేరి యుద్ధ విమానం నడపాలన్నదే తన కల అని ఉత్తరప్రదేశ్కు చెందిన సానియా మీర్జా అనే యువతి చెప్పారు. మిర్జాపూర్ దెహత్ కొత్వాలి పోలీస్స్టేషన్ పరిధిలోని జసోవర్ గ్రామానికి చెందిన సానియా మీర్జా ఒక సాధారణ టీవీ మెకానిక్ కుమార్తె. అయినా ఆమె కష్టపడి చదవి ఇటీవల నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) నిర్వహించిన ప్రవేశపరీక్షలో అర్హత సాధించారు.
భారత వాయుసేనలో చేరి యుద్ధ విమానం నడపాలన్నదే తన కల అని, అందుకే ప్రవేశ పరీక్ష రాసి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం పొందానని సానియా మీర్జా చెప్పారు. హిందీ మీడియా విద్యార్థిని అయిన సానియా.. పట్టుదల ఉంటే హిందీ మీడియం అయినా విజయం సాధించవచ్చు అని నిరూపించారు. ఈ నెల 27న సానియా పుణెలోని ఖడక్వస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరనున్నారు.
దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్గా గుర్తింపు పొందిన అవని చతుర్వేది తనకు రోల్ మోడల్ అని, ఆమెను ఆదర్శంగా తీసుకునే తాను కూడా మహిళా ఫైటర్ పైలట్ కావాలని నిర్ణయించుకున్నానని సానియా చెప్పారు. సానియా సాధించిన ఘనతతో ఆమె పేరేంట్స్తోపాటు గ్రామస్తులు కూడా చాలా గర్వంగా ఫీలవుతున్నారు.