డెహ్రాడూన్: ఇటీవల భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన ఉత్తరాఖండ్లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం నాటికి మొత్తం మృతుల సంఖ్య 76కు చేరింది. మరో ఐదుగురి ఆచూకీ లభించాల్సి ఉంది. ఇక ఇప్పటి వరకు ఈ వరదలు, వర్షాలవల్ల 24 మంది గాయపడ్డారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల ఇండ్లు కూలిపోయాయి. మొత్తం 224 ఇండ్లు ధ్వంసమయ్యాయి.
ఇదిలావుంటే ఉత్తరాఖండ్ వర్షం బాధితుల సహాయార్థం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన అక్టోబర్ నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చారు. ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా పూర్తిగా చక్కబడలేదు. ఆవాసాలు కోల్పోయిన వాళ్లు, లోతట్టు ప్రాంతాల వాళ్లు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. వారి కోసం ప్రభుత్వం ఆహార, ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తున్నది.