డెహ్రాడూన్: చార్ధామ్ దేవస్థానం బోర్డును ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుస్కర్ సింగ్ ధామి ప్రకటించారు. అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత.. చార్ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. చార్ధామ్ దేవస్థానం బోర్డును 2019లో ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్డును రద్దు చేయాలని స్థానిక పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయాల సాంప్రదాయ హక్కులు అడ్డుకుంటున్నట్లు వాళ్లు ఆరోపించారు. దేవస్థానం బోర్డుపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం ధామి ఈ నిర్ణయం తీసుకున్నారు. మనోహర్ కంట్ దయానీ నేతృత్వంలోని బృందం రిపోర్ట్ను తయారు చేసింది. దేవస్థానం బోర్డు కింద 51 ఆలయాల నిర్వహణ ఉండేది. కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రీ ఆలయాలు కూడా ఆ బోర్డు పరిధిలో ఉన్నాయి.