న్యూఢిల్లీ: అటవీ పరిశోధన కోసం ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లోకి ( Forest Research Institute ) ఈ నెల 13 నుంచి సందర్శకులను తిరిగి అనుమతించనున్నారు. కరోనా మహమ్మారి విస్తృతి కారణంగా గత కొన్ని నెలలుగా ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లోకి సందర్శకులకు అనుమతిపై నిషేధం విధించారు. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగపడటంతో సందర్శకుల అనుమతిని పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.
అయితే, సందర్శకులను ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లోకి అనుమతించినా కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కేవలం 200 మంది సందర్శకులను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. ఇన్స్టిట్యూట్ను సందర్శించాలనుకునే వారు ముందుగానే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు.