లక్నో, డిసెంబర్ 25: ఉత్తరప్రదేశ్లో గత నాలుగు రోజులుగా మాంసం ఎగుమతిదారులే లక్ష్యంగా జరిగిన ఐటీ దాడుల్లో భారీగా నల్లధనం బయటపడింది. గత బుధవారం నుంచి యూపీలోని లక్నో, బరేలి, ఉన్నావ్ జిల్లాల్లో మాంసం ఉత్పత్తి, ఎగుమతి చేసే నాలుగు సంస్థలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.
రుస్తమ్ ఫుడ్స్, రెహ్బర్ ఫుడ్ ఇండస్ట్రీస్, అల్ – సుమమ ఆగ్రో ఫుడ్స్, మార్యా ఫ్రోజెన్ ఆగ్రో ఫుడ్స్ అనే సంస్థల కార్యాలయాలు, యూనిట్లు, యాజమానుల ఇళ్లల్లో సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో రూ.1,200 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.