న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలకు అమెరికా అనుమతి ఇచ్చింది. దీంతో భారత్ సహా మరికొన్ని దేశాలకు అమెరికా నిర్ణయం ఎంతో ఊరటనిచ్చింది. గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు పలు ఆంక్షలను అమెరికా విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తు త పరిస్థితుల కారణంగా అమెరికా యూటర్న్ తీసుకున్నది. ఈ మే 16 వరకు ఈ నిర్ణయం వర్తిస్తుందని వెల్లడించారు. అయి తే కొత్తగా చమురు కొనుగోలు చేసేందుకు ఈ ఉత్తర్వు వర్తించదని, ఇప్పటికే కొనుగోలు చేసి రవాణాలో ఉన్న చమురుకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇరాన్ సైతం హర్మొజ్ జలసంధిని పూర్తి గా తెరిచినట్టు ప్రకటించడంతో చమురు ధరలు భారీగా దిగివచ్చాయి. ప్రస్తుతం బ్యారెల్ చమురు 90 డాలర్లు పలుకుతున్నది.