న్యూఢిల్లీ, డిసెంబర్ 2: భారత రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్) పరీక్ష 2023 నుంచి ప్రత్యేకంగా రూపొందించిన పద్ధతిలో జరుగుతుందని భారత రైల్వే తెలిపింది. ఈ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఐఆర్ఎంఎస్ పరీక్ష పద్ధతిలా..
రెండు దశల్లో ఐఆర్ఎంఎస్ పరీక్ష ఉంటుంది.
1. ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష 2. మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ
రెండో దశ కోసం ఎంపికయ్యే అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
మెయిన్స్ రాత పరీక్షలో 4 పేపర్లు ఉంటాయి. వాటిని వ్యాసరూపంలో రాయాల్సి ఉంటుంది.
మెయిన్స్ పరీక్షలోని పేపర్లు
పేపర్-ఏ : భారత భాషల్లోని ఏదేని భాషను ఎంచుకోవాలి. ఈ భాషకు సంబంధించి 300 మార్కులు ఉంటాయి.
పేపర్-బీ : ఇంగ్లిష్. దీనికి కూడా 300 మార్కులు ఉంటాయి.
మెరిట్ కోసం ఎంపికచేసేందుకు నిర్వహించే పరీక్షలు
ఆప్షనల్ సబ్జెక్ట్ – పేపర్ 1 = 250 మార్కులు
ఆప్షనల్ సబ్జెక్ట్ – పేపర్ 2 = 250 మార్కులు
పర్సనాలిటీ టెస్ట్ = 250 మార్కులు
ఆప్షనల్ సబ్జెక్టులు
సివిల్ ఇంజినీరింగ్
మెకానికల్ ఇంజినీరింగ్
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
కామర్స్ అండ్ అకౌంటెన్సీ