ఢిల్లీ : ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2020కి హాజరైన అభ్యర్థుల అందరి మార్కుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. మార్కుల జాబితాను అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో పొందుపరిచింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ని నిర్వహించింది. మొత్తం 347 ఖాళీలకు గాను 302 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. రిజర్వ్ జాబితాలో 90 మందిని, ప్రొవిజినల్ జాబితాలో మరో 39 మంది కమిషన్ సిఫారసు చేసింది. అక్టోబరు 2020 నిర్వహించిన రాత పరీక్ష అదేవిధంగా మార్చి-ఏప్రిల్ 2021లో నిర్వహించిన మౌఖిక పరీక్ష ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది.
నియామకం లేదా పరీక్షకు సంబంధించి ఏదైనా సమాచారంగానీ, స్పష్టత కోసంగానీ అభ్యర్థులు యూపీఎస్సీ ఫెసిలిటేషన్ సెంటర్ను సంప్రదించవచ్చని కమిషన్ పేర్కొంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన క్యాంపస్లోని ఎగ్జామినేషన్ హాల్ భవనానికి సమీపంలో ఈ ఫెసిలిటేషన్ కౌంటర్ను కలిగి ఉంది. పనిరోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య అభ్యర్థులు వ్యక్తిగతంగా గానీ లేదా టెలిఫోన్(011-23385271, 011-23381125) ద్వారాగానీ సంప్రదించచ్చని యూపీఎస్సీ తెలిపింది.