న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరి నెలలో రూ.28.33 లక్షల కోట్లకు చేరుకున్నాయని, అలాగే సంఖ్యపరంగా చూస్తే 21.70 బిలియన్లుగా నమోదయ్యాయయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) వెల్లడించింది. డిసెంబర్ నెలలో నమోదైన రూ.27.97 లక్షల కోట్ల కంటే ఇది 21 శాతం వరకు అధికం. సరాసరిగా రోజుకు 700 మిలియన్ల లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.91,033 కోట్లుగా ఉన్నాయి.