రాంచీ, సెప్టెంబర్ 1: శాసనసభ్యుడిగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్పై అనర్హత వేటు అంశానికి సంబంధించి ఉద్దేశపూర్వకంగా బయటకు వస్తున్న లీకులను యూపీఏ బృందం ఆక్షేపించింది. రాష్ట్ర గవర్నర్ రమేశ్ బాయిస్తో యూపీఏ నేతలు గురువారం సమావేశమయ్యారు. అటువంటి సెలెక్టివ్ లీకు లు గందరగోళం, అస్పష్టత, అనిశ్చితి సృష్టిస్తాయని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.
సొరేన్పై అనర్హత వేటు వేయాలంటూ ఈసీ చేసిన సిఫారసుపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సొరేన్ భవితవ్యంపై జరుగుతున్న ప్రచారం.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలను ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. ఒకవేళ సీఎం సొరేన్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై వేటు పడినా, ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం పడదని, అధికార జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ ఉన్నదని యూపీఏ నేతలు అభిప్రాయపడ్డారు. మైనింగ్ లీజు వ్యవహారంలో సొరేన్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘం ఇటీవల చేసిన సిఫారసుపై గవర్నర్ ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోని విషయం తెలిసిందే.