ముజఫర్నగర్: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో నేరం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం గొడవపడి భార్య గొంతు నులిమి చంపేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాకు చెందిన మోసిన, యాస్మిన్ మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.
జిల్లాలోని చౌసానా పట్టణంలో దంపతులిద్దరూ నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లు యాస్మిన్ను బాగానే చూసుకున్న మోసిన్ ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. దాంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా కట్నం విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారు. మాటామాటా పెరుగడంతో ఆగ్రహించిన మోసిన భార్యను గొంతు నులిమి చంపేసి పారిపోయాడు. యాస్మిన్ను మోసిన్ ఎప్పుడూ కట్నం కోసం వేధించేవాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.