లక్నో: ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన మహిళా ఐపీఎస్ అధికారిణి సస్పెండ్ అయ్యింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారిణి అలంకృత సింగ్ గత ఏడాది అక్టోబర్ నుంచి విధులకు హాజరు కావడం లేదు. 2008 ఐసీఎస్ బ్యాచ్కు చెందిన ఆమె మహిళలు, పిల్లల రక్షణకు సంబంధించిన 1090 విభాగానికి ఎస్పీగా ఉన్నారు. అయితే 2021 అక్టోబర్ 19న మహిళలు, చైల్డ్ ప్రొటెక్షన్ ఏడీజీకి ఆమె వాట్సాప్ కాల్ చేశారు. తాను లండన్లో ఉన్నట్లు చెప్పారు.
కాగా, నాటి నుంచి అలంకృత సింగ్ విధులకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సెలవు అనుమతి పొందలేదు. లండన్లోనే ఇప్పటికీ ఉంటున్నట్లు తెలిసింది. దీంతో ఆమె వరుసగా విధులకు హాజరుకాని విషయం సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆదేశాలతో హోంశాఖ చర్యలు తీసుకుంది. ఐపీఎస్ అధికారిణి అలంకృత సింగ్ను సస్పెండ్ చేసింది. డీజీపీ ప్రధాన కార్యాలయానికి ఆమెను అటాచ్ చేసింది.
మరోవైపు అలంకృత సింగ్ చైల్డ్ డెవలప్మెంట్ స్టడీస్లో ప్రోగ్రాం కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫెలోషిప్ పొందినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె లండన్లో ఉండి ఆ కోర్సు చదువుతున్నట్లు తెలుస్తున్నది.