లక్నో, ఆగస్టు 22: ఉత్తరప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆనందేశ్వర్ పాండే ఇద్దరు మహిళలతో బట్టలు లేకుండా అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయంపై ప్రాంతీయ క్రీడాధికారి అసోసియేషన్ నుంచి నివేదిక కోరుతూ ఓ లేఖ రాశారు. నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు.
ఇటువంటి ఫొటోల వలన ఉత్తరప్రదేశ్ ఇమేజ్ పాడవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆనందేశ్వర్ ఫొటోల విషయంపై సీఎం పోర్టల్లో కూడా ఫిర్యాదు నమోదైంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉత్తరప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి నుంచి నివేదిక కోరారు. లేఖ కాపీని జిల్లా కలెక్టర్కు కూడా పంపించారు.