Delhi JNU | ఢిల్లీ జేఎన్యూపై యూపీ మంత్రి ఠాకూర్ రఘురాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్యాంపస్లో సెక్స్ స్కాండల్ జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్తో సహా, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా వెళ్తుంటారని సంచలన ఆరోపణలకు దిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొన్న ర్యాలీలోనే రఘురాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనించాల్సిన అంశం. అయితే ఠాకూర్ రఘురాజ్ సింగ్ గతంలోనూ ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేశారు. నవంబర్లో ఓ సమావేశంలో మాట్లాడుతూ… దేవుడు గనక తనకు అవకాశం కల్పిస్తే, దేశంలోని మొత్తం మదర్సాలను మూసివేయిస్తానని ప్రకటించారు.