లక్నో, జనవరి 23: ఉత్తరప్రదేశ్లో బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్బై చెప్పారు. ఫతేహాబాద్ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ ఆదివారం బీజేపీకి రాజీనామా చేశారు. తాను సమాజ్వాదీ పార్టీలో చేరినట్టు ఆయన వెల్లడించారు.‘పార్టీలో కార్యకర్తలకు, ఎమ్మెల్యేల మాటకు విలువ లేదు. రైతులకు ఎరువులు ఇవ్వలేకపోతే ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభం? మరింత మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడుతారు’అని ఆయన పేర్కొన్నారు.