లక్నో: అల్లర్లకు పాల్పడిన వారికి రిటర్న్ గిఫ్ట్ అంటూ ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వివాదస్పమైంది. సుమారు 9 మంది వ్యక్తులను ఇద్దరు పోలీసులు లాఠీలతో దారుణంగా కొడుతున్న ఫొటోలు, వీడియోలను ఆయన ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు గతంలో మీడియా సలహాదారుగా కూడా ఆయన ఉన్నారు. యూపీలో శుక్రవారం అల్లర్ల అనంతరం అరెస్ట్ చేసిన వారి పట్ల పోలీసులు ఈ మేరకు వ్యవహరించినట్లు తెలుస్తున్నది.
మరోవైపు దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దీనిని ఖండించారు. ఇలాంటి సంఘటనలు న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని కోల్పోతాయని అన్నారు. ఇలాంటి పోలీస్ స్టేషన్ల పని తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. కస్టడీ మరణాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, దళితులను అవమానించడంలో యూపీ తొలి స్థానంలో ఉందని ఆయన ఆరోపించారు.
కాగా, ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో శుక్రవారం జరిగిన అల్లర్లకు సంబంధించి సుమారు 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రయాగ్రాజ్లో 91 మంది, సహరాన్పూర్లో 71 మంది, హత్రాస్లో 51 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో కొందరి ఆస్తులను అధికారులు బుల్డోజర్లతో కూల్చి ధ్వంసం చేశారు.
यूपी याद है या याद दिलाऊँ ? जब मुख्यमंत्री जी के लिए अभद्र भाषा बोलने पर यूपी की जनता ने “काला मोर” बना डाला था, फिर आए भी नहीं आप यूपी 😁 आइए ना फिर कभी 🤣 https://t.co/pmuNTElL26
— Dr. Shalabh Mani Tripathi (@shalabhmani) June 11, 2022
उठने चाहिए ऐसी हवालात पर सवालात
नहीं तो इंसाफ़ खो देगा अपना इक़बाल– यूपी हिरासत में मौतों के मामले में न. 1
– यूपी मानवाधिकार हनन में अव्वल
– यूपी दलित उत्पीड़न में सबसे आगे pic.twitter.com/BCGn93LO49— Akhilesh Yadav (@yadavakhilesh) June 11, 2022