లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం లక్నోలోని రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేశారు. 15 ఏండ్లుగా ఎంపీగా గెలిచిన ఆయన తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తనకు పట్టున్న గొరఖ్పూర్ అర్బన్ స్థానంలో పోటీ చేసి లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందారు.
కాగా, ఉత్తరప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది. సీఎం అభ్యర్థి ఎవరన్నది ఎన్నికలప్పుడు బీజేపీ ప్రకటించలేదు. దీంతో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయనే సీఎం అవుతారన్న టాక్ వినినిస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి రెండోసారి సీఎం పదవిని అధిష్ఠించి మరో రికార్డు సృష్టించనున్నారు.
#WATCH UP CM Yogi Adityanath tenders his resignation to Governor Anandiben Patel at Raj Bhavan in Lucknow pic.twitter.com/WM3TzqBwcF
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 11, 2022