అహ్మదాబాద్, మే 14: నీట్ యూజీ-2026 పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు గురువారం తీవ్ర నిరసన తెలిపాయి. అహ్మదాబాద్ ఐఐఎంలో జరిగే ఒక సమావేశానికి మంత్రి వచ్చిన విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్దయెత్తున క్యాంపస్ బయట గుమిగూడారు.
సమావేశం నుంచి బయటకు వెళ్తున్న మంత్రి ప్రధాన్కు ఆందోళనకారులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీకి మంత్రి నైతిక బాధ్యత వహించాలని, వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.