న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి వర్గం నుంచి పశుపతి పరాస్ వైదొలిగారు. బీహార్లో లోక్సభ ఎన్నికల్లో మిత్రపక్షాలతో సీట్ల పంపకాల ఒ ప్పందం నుంచి రాష్ట్రీయ లోక్జనశక్తి పార్టీని తప్పించి బీజేపీ అన్యాయం చే సిందని ఆరోపిస్తూ మంగళవారం రా జీనామా చేశారు. సీట్ల పంపకాల్లో భా గంగా చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీకి బీజేపీ ఐదు సీట్లు ఇచ్చిన మరుసటి రోజే పరాస్ రాజీనామా ప్ర కటించారు. ఎన్డీఏకు తాను నిజాయి తీ, విధేయతతో పనిచేశానని, అయితే తనకు అన్యాయం జరిగిందని పరాస్ వాపోయారు. ఎన్డీయే నుంచి వైదొలగిన పరాస్.. విపక్ష ఆర్జేడీ కూటమిలో చేరి హాజీపూర్ నుంచి చిరాగ్పై పోటీచేయనున్నట్టు సమాచారం.