నాగ్పూర్: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఏం చెప్పినా చేయడానికి ప్రభుత్వాధికారులు సిద్ధంగా ఉండాలని, కేవలం yes sir మాత్రమే అనాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తాము చెప్పింది అమలు చేయడానికి ఎల్లప్పుడు రడీగా ఉండాలని చెప్పారు. నాగ్పూర్లోని ఓ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ మాట్లాడుతూ.. బ్యూరోక్రాట్లు చెప్పినట్లు ప్రభుత్వాలు నడువవని, తాము చెప్పినట్లే నడుస్తాయని అన్నారు. మీరు కేవలం ఎస్సార్ అని మాత్రమే అనాలి. మేం చెప్పింది తూచా తప్పకుండా చేయాలని తానేప్పుడూ అంటూ ఉంటానని వెల్లడించారు.
మహాత్మాగాంధీని ఉటంకిస్తూ.. పేదల సంక్షేమానికి ఏ చట్టం అడ్డురాదని, అలా అడ్డుపడే చట్టాన్ని పదిసార్లు ఉల్లంఘించాల్సి వస్తే.. దానికి మనం వెనుకాడకూడదని చెప్పారు.