న్యూఢిల్లీ: కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా వైరస్ సంక్రమించింది. సోమవారం ఆయన్ను ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. చందౌలీ నియోజకవర్గానికి చెందిన ఆయన వయసు 65 ఏళ్లు. గతంలోనూ ఓసారి ఆయనకు కరోనా సోకింది. కౌసంబీలోని యశోద హాస్పిటల్లో మంత్రి చేరారు. రెండు రోజుల నుంచి అస్వస్థతతో ఉన్నానని, కోవిడ్ పరీక్ష చేయించుకుంటే, పాజిటివ్గా వచ్చిందని, తనతో కాంటాక్ట్లోకి వచ్చినవారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన తన ట్విట్టర్లో కోరారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ మొదలైందని, డాక్టర్ల బృందం మంత్రి ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తగా హాస్పిటల్లో చేరానని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. బీజేపీ చెందిన ఎంపీ మనోజ్ తివారీకి కూడా కరోనా సోకింది. ఆయన కూడా పరీక్షలో పాజిటివ్గా తేలారు. స్వల్పంగా జ్వరం, జలుబు ఉన్నట్లు ఆయన తెలిపారు.