గుజరాత్ లో కోవిడ్ పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. సిఎం విజయ్ రూపానీ డిప్యూటీ, సిఎం నితిన్ పటేల్ తో పాటు వైద్యాశాఖ అధికారులు ఈసమీక్షలో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన అహ్మదాబాద్ లోని ధన్వంతరి కోవిడ్ హాస్పిటల్ ని సందర్శించారు. పనులను పరిశీలించారు. DRDO, గుజరాత్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ హాస్పిటల్ ని శనివారం రోజున ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కోవిడ్ రోగుల కోసమే ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ ని ఏర్పాటు చేశారు.