న్యూఢిల్లీ : దేశంపై దుష్ప్రచారం, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ చానెల్స్పై కేంద్రం కొరఢా ఝుళిపించింది. పది చానల్స్కు సంబంధించిన 45 యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేసింది. అసత్య వార్తలు, మార్ఫింగ్ వీడియోలు, విద్వేషాల వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించింది. అగ్నిపథ్, ఆర్మీ, కశ్మీర్ అంశాలపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నట్లు గుర్తించిన కేంద్రం.. ఈ మేరకు ఆయా చానెల్స్కు చెందిన 45 వీడియోలను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని సోమవారం సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇటీవల కేంద్రం పెద్ద ఎత్తున యూట్యూబ్ చానెల్స్పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.