న్యూఢిల్లీ: ముస్లిం లీగ్ జమ్ము కశ్మీర్ (మసరత్ ఆలం గ్రూప్)పై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్నదన్న ఆరోపణలతో వేటు వేసింది. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం ముస్లింలీగ్ జమ్ముకశ్మీర్ (మసరత్ ఆలం వర్గం)పై నిషేధం విధిస్తున్నాం. ఈ సంస్థ సభ్యులు జమ్ముకశ్మీర్లో దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. జమ్ముకశ్మీర్లో ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటుచేసేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు’ అని కేంద్రం నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఈ సంస్థ చీఫ్ మసరత్ ఆలం భట్కు భారత వ్యతిరేకి అనే ముద్ర ఉన్నది.