న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతం, ఉత్తరప్రదేశ్ నీటి అవసరాలను తీర్చే ‘కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు’కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గ్రాంట్ కింద రూ.36,290 కోట్లు, రుణం కింద రూ.3,027 కోట్లు కేంద్రం సమకూర్చనుంది. దేశంలో నదుల అనుసంధానానికి ఈ ప్రాజెక్టు ఓ మోడల్గా నిలుస్తుందని తెలిపింది. మరోవైపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణాలకు అందించే సాయాన్ని మరో మూడేండ్లపాటు పొడిగించడానికి మంత్రి ఆమోదం తెలిపింది. 2024 మార్చి 31 వరకు ఈ పథకం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 2.95 కోట్ల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 1.65 కోట్ల ఇండ్లను నిర్మించామని పేర్కొంది. క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.