Ultra Processed Food | న్యూఢిల్లీ: చిప్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తినడం వల్ల దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో మరణించే ముప్పు పెరుగుతుందని ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. 96 వేల మంది డాటా సేకరించి ఈ అధ్యయనం జరిపారు.
తినే ఆహారంలో అల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్స్ 40% కంటే ఎక్కువ ఉంటే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో మరణించే ముప్పు 26% పెరుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసనాళాల వాపు, ఎంఫిసెమా, ఆస్తమా వంటి సమస్యల ముప్పు 10% పెరుగుతుందని తెలిపారు.