గువహటి : గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి అసోం కోర్టు బెయిల్ మంజూరైంది. జిగ్నేశ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను నిన్న కోర్టు విచారించినప్పటికీ, తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఇవాళ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది.
ఎమ్మె ల్యే జిగ్నేశ్ మేవానీని అస్సాం పోలీసులు గత వారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీపై వివాదాస్పద ట్వీట్ చేశారంటూ అస్సాంలో దాఖలైన కేసులో బుధవారం రాత్రి 11.30 గంటలకు పాలంపూర్లో అదుపులోకి తీసుకొని అసోం తరలించారు.
అసోంకు చెంది న ఓ బీజేపీ నేత ఫిర్యాదుతో మెవానీపై కేసు నమోదైంది. ప్రముఖ దళిత నేతగా పేరున్న జిగ్నేశ్, గుజరాత్లోని వద్గాం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల ఆయన కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. గాంధీజీని హత్య చేసిన గాడ్సేని మోదీ దేవుడిలా భావిస్తున్నారని జిగ్నేశ్ గతంలో ట్వీట్ చేశారు.