UGC | న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార కమిటీల నియామకాలకు సంబంధించి యూజీసీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో పాటు ఒక మహిళకు ఈ కమిటీలలో చైర్పర్సన్గా గానీ, సభ్యుడిగా గానీ కచ్చితంగా ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేసింది.
జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఈ పాలసీని ఈనెల 11న యూజీసీ నోటిఫై చేసింది. ఇక నుంచి అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం కనీసం ఒక్క మహిళనైనా విద్యార్థుల గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీలో చైర్పర్సన్గా గానీ, సభ్యురాలిగా గానీ ఉండాలి. అలాగే కనీసం ఒక్కరైనా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి చైర్మన్గా గానీ, సభ్యులుగా గానీ ఉండాలి.