న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్లోకి యదేచ్ఛగా మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయి. దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో ప్రతిరోజు ఏదోఒక చోట బంగారంతోపాటు డ్రగ్స్, హెరాయిన్ (Heroin), కొకైన్ పట్టుబడుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం ఢిల్లీలో భారీగా హెరాయిన్ దొరికింది.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విమానాశ్రయంలో తనిఖీల్లో భాగంగా ఉగాండాకు చెందిన ప్రయాణికుడి వద్ద 1060 గ్రాముల హెరైన్ లభించింది. దీంతో కస్టమ్స్ అధికారులు దానిని సీజ్చేశారు. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.7.43 కోట్లు ఉంటుందని చెప్పారు.
కొకైన్ను క్యాప్సుల్స్గా మార్చి సుట్కేసులో దుస్తుల మధ్య ఉంచారని వెల్లడించారు. మొత్తం 107 క్యాప్సుల్ దొరికాయని తెలిపారు. నిందుతునిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదుచేశామన్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, కొకైన్ను ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం తెలుసుకుంటున్నామని చెప్పారు.