ముంబై: ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ.. లోక్సభ ఎన్నికల(Lok sabha polls)కు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. ఫస్ట్ లిస్టులో 16 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మాజీ కేంద్ర మంత్రులు అనంత్ గీతే, అర్వింద్ సావంత్లకు తొలి జాబితాలో చోటు కల్పించారు. రాయిగడ్ నుంచి అనంత్ గీతే, సౌత్ ముంబై నుంచి అరవింద్ సావంత్ పోటీపడనున్నారు. థానే నుంచి రంజన్ విచారే, ముంబై నార్త్ వెస్ట్ నుంచి అమోల్ కీర్తికర్, ముంబై నార్త్ ఈస్ట్ నుంచి సంజయ్ పాటిల్ పోటీలో ఉన్నారు. ఉద్దవ్ నేతృత్వంలోని శివ సేన పార్టీ.. మహా వికాశ్ అఘాది కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం అయిదు దశల్లో ఆ స్థానాలకు పోలింగ్ జరగనున్నది.
हिंदुहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या आशीर्वादाने आणि शिवसेना पक्षप्रमुख मा. श्री. उद्धवसाहेब ठाकरे ह्यांच्या आदेशाने शिवसेनेच्या १७ लोकसभा उमेदवारांची यादी जाहीर करण्यात येत आहे.
१७. मुंबई दक्षिण मध्य: श्री अनिल देसाई
इतर १६ उमेदवार पुढील प्रमाणे: pic.twitter.com/kVDrOHLWtw
— ShivSena – शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) March 27, 2024