Maharastra | కరోనా ఆంక్షలను మహారాష్ట్ర సర్కార్ తాజాగా సవరించుకుంది. బ్యూటీ సెలూన్లు, జిమ్స్ 50 శాతం కెపాసిటీతో నడుపుకోవచ్చంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారినే సెలూన్లు, జిమ్లోకి అనుమతించాలని ఉత్తర్వుల్లోతేల్చి చెప్పింది. ఇంతకు మునుపు ఇచ్చిన జీవోలో సెల్లూన్లు, స్పా, జిమ్స్ ను మూసేయాలని పేర్కొంది. ఈ జీవో ఇచ్చిన 24 గంటల్లోనే మళ్లీ సవరించుకొని, కొత్త మార్గదర్శకాలతో ఓ జీవోను విడుదల చేసింది. 50 శాతం కెపాసిటీతో బ్యూటీ సెలూన్స్ నడుపుకోవచ్చు. అయితే మాస్క్ ధరించిన వారిని మాత్రమే అనుమతించాలి. అలాగే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారినే అనుమతించాలి. అని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరోవైపు మహారాష్ట్రలో కోవిడ్ గు్రరూపం దాలుస్తోంది. తాజాగా ఒక్క రోజు వ్యవధిలోనే 41 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనాతో చనిపోయారు. ముంబై మహా నగరంలో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా కఠిన ఆంక్షలను విధించింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రకటించింది. ఇక ఫిబ్రవరి 15 వరకూ పాఠశాలలను కూడా మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది.