చెన్నై : ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని..అది సర్వ రోగ నివారిణి కాదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ లా కమిషన్కు స్పష్టం చేశారు. ‘వైవిధ్యమైన మన సమాజ నిర్మాణానికి యూసీసీ వల్ల తీవ్రమైన ప్రమాదం, సవాళ్లు ఏర్పడతాయి’ అని లా కమిషన్ చైర్పర్సన్కు రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు.
సామాజిక, ఆర్థిక అంతరాలను పరిగణనలోనికి తీసుకోకుండా యూసీసీ అమలు చేస్తే విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంటుందన్నారు. యూసీసీ ప్రతిపాదనతో ప్రజాస్వామ్యం ధ్వంసం అవుతుందని అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఏఐఎల్యూ) విమర్శించింది.