బెంగళూరు, జూన్ 29: అప్పు కట్టలేదన్న కారణంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై దాడి చేశారు. వారిని వివస్త్రలను చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. ప్రజలు తీవ్ర నిరసన తెలపడంతో రెండు రోజుల తర్వాత నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత కర్ణాటకలోని బెంగళూరులో ఈ దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నాడు. పిల్లల చదువుల కోసమని బాధితుల్లో ఒకరు రామకృష్ణా రెడ్డి అనే వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకొన్నారు. అప్పు తీర్చాలని ఒత్తిడి చేయగా స్థలం అమ్మి కట్టాలని నిర్ణయించారు. గ్రామస్థులు కూడా రామకృష్ణకు సర్ది చెప్పారు. అయినప్పటికీ వినకుండా రామకృష్ణా రెడ్డి, మరో ఇద్దరు వ్యక్తులు బాధితుల ఇంట్లోకి చొచ్చుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు.