ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ముంబైలోని కండివాలీ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
కాల్పులకు వ్యక్తిగత గొడవలే కారణమని డీసీపీ విషాల్ ఠాకూల్ తెలిపారు. దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. మృతుడిని అంకిత్ యాదవ్గా గుర్తించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు.
Maharashtra | At around 12:15 am, we got information that two people on a bike opened fire on some people in Mumbai's Kandivali police station area. One person died in the accident and 3 others were injured. Further investigation underway: Vishal Thakur, DCP Zone-11 pic.twitter.com/TmfmkCuDG9
— ANI (@ANI) October 1, 2022